- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలోని మున్సిపాలిటీలకు సంబంధించిన రూ.581.60 కోట్ల గ్రాంట్లను విడుదల చేయాలని ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర మంత్రి హర్దీప్సింగ్పూరికి లేఖ రాశారు. ఇప్పటివరకు ఇచ్చిన రూ.3054 కోట్లకు సంబంధించి వినిమయ పత్రాలను సమర్పించినట్లు ఆయన లేఖలో వెల్లడించారు.
14వ ఆర్థిక సంఘం నిర్దేశించిన పట్టణ పౌర సేవలకు సంబంధించిన మూడు ప్రధాన సంస్కరణలను అమలు చేసినట్లు తెలిపారు. పురపాలక సంఘాల ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎంపీ వెల్లడించారు. కనీస మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం ఎన్నో ప్రయాసలకోర్చి నిధులు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. కోవిడ్కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృష్ట్యా సత్వరమే గ్రాంట్లకు సంబంధించిన నిధులను విడుదల చేయాలని లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు.
Next Story