వైసీపీలో జోష్.. పీఏసీ సభ్యుడిగా ఆ నేత ఏకగ్రీవం

by Vemula.Srinu Prasad |   (  Updated:2021-08-10 04:04:39  IST  )

<p>దిశ, ఏపీ బ్యూరో: కేంద్ర ప్రభుత్వ ప్రజా పద్దుల కమిటీ సభ్యులుగా వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని రాజ్యసభ సెక్రటరీ జనరల్‌ దేష్‌ దీపక్‌ వర్మ అధికారికంగా ప్రకటించారు. రాజ్యసభ నుంచి గతంలో పీఏసీ సభ్యులుగా వ్యవహరించిన భూపేందర్ యాదవ్‌, రాజీవ్‌ చంద్రశేఖర్‌‌లకు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కడంతో వారి స్థానాలు ఖాళీ అయ్యాయి. ఖాళీ అయిన ఈ రెండు స్థానాలకు విజయసాయి రెడ్డితో పాటు బీజేపీ ఎంపీ డా.సుధాంశు త్రివేది [&hellip;]</p>

వైసీపీలో జోష్.. పీఏసీ సభ్యుడిగా ఆ నేత  ఏకగ్రీవం
X

దిశ, ఏపీ బ్యూరో: కేంద్ర ప్రభుత్వ ప్రజా పద్దుల కమిటీ సభ్యులుగా వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని రాజ్యసభ సెక్రటరీ జనరల్‌ దేష్‌ దీపక్‌ వర్మ అధికారికంగా ప్రకటించారు. రాజ్యసభ నుంచి గతంలో పీఏసీ సభ్యులుగా వ్యవహరించిన భూపేందర్ యాదవ్‌, రాజీవ్‌ చంద్రశేఖర్‌‌లకు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కడంతో వారి స్థానాలు ఖాళీ అయ్యాయి. ఖాళీ అయిన ఈ రెండు స్థానాలకు విజయసాయి రెడ్డితో పాటు బీజేపీ ఎంపీ డా.సుధాంశు త్రివేది నామినేషన్లు దాఖలు చేశారు. ఇంకెవ్వరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో ఈ ఇద్దరు ఎంపీలు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రాజ్యసభ సెక్రటరీ జనరల్ దేష్ దీపక్ వర్మ ప్రకటించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి వైసీపీ ఎంపీలు అభినందనలు తెలిపారు.

Next Story