కన్నా.. బాబు కోవర్టని మళ్లీ రుజువైంది

by  |
కన్నా.. బాబు కోవర్టని మళ్లీ రుజువైంది
X

దిశ, ఏపీ బ్యూరో: మూడు రాజ‌ధానుల ఏర్పాటుకు వ్య‌తిరేకంగా బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ గవర్నర్ కి లేఖ రాయడంపై వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ మాధ్యమంగా ధ్వజమెత్తారు. ఈమేరకు ట్విట్టర్ లో ఆయన…”క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ చంద్ర‌బాబు కోవ‌ర్టు అని మ‌ళ్లీ స్ప‌ష్ట‌మైంది. సొంత పార్టీ అభిప్రాయానికి వ్య‌తిరేకంగా చంద్రబాబుకు అనుకూలంగా రాజ‌ధాని బిల్లు ఆమోదించ‌వ‌ద్ద‌ని గ‌వ‌ర్న‌ర్‌కు లేఖ రాశారు. దీంతో పార్టీ అధిష్టానం ఆగ్ర‌హానికి గుర‌య్యారు. ఇంకా ఎన్నాళ్లు ఈ ముసుగు క‌న్నా?” అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు..



Next Story

Most Viewed