వెంకయ్యనాయుడుపై నా వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నాను

by  |
వెంకయ్యనాయుడుపై నా వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నాను
X

దిశ, వెబ్‌డెస్క్: రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడిపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. సోమవారం రాజ్యసభలో వెంకయ్యనాయుడు పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారు. మనిషి ఒకచోట.. ఆయన మనసు మరోచోట ఉందని విజయసాయిరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో తన వ్యాఖ్యలపై విజయసాయిరెడ్డి మంగళవారం ఉదయం వివరణ ఇచ్చారు.

రాజ్యసభ చైర్మన్‌పై వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నానని విజయసాయిరెడ్డి వెల్లడించారు. వెంకయ్యనాయుడుపై తన వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నానని అన్నారు. తాను ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యానించలేదని.. ఆవేశంలో మాట్లాడనని తెలిపారు. ఇలాంటివి మరోసారి పునరావృతం కాకుండా చూసుకుంటానని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌పై చర్యలు తీసుకోవాలని కోరే సమయంలో రాజ్యసభ చైర్మన్‌పై విజయసాయిరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు.



Next Story