బాబును గొలుసులతో కట్టేయాల్సిందే: విజయసాయిరెడ్డి

by  |
బాబును గొలుసులతో కట్టేయాల్సిందే: విజయసాయిరెడ్డి
X

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ మాధ్యమంగా తీవ్ర విమర్శలు చేశారు. విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో చోటుచేసుకున్న దుర్ఘటనపై బాబు చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ, “స్టైరీన్ గ్యాస్ అంటే ఏమిటో జ్ఞానినైన తనకే అంతుబట్టడంలేదని, ఇక ఈ ఐఏఎస్ లకు ఏం తెలుస్తుందని అంటున్నాడు. బాధితులకు చికిత్స కోసం బయటి నుంచి నిపుణులను రప్పించాలట. మొన్న కూడా ఇంతే, కరోనా వైరస్ కు చికిత్స చేయడానికి ఇక్కడి డాక్టర్లకేం తెలుసని పేలాడు. చూస్తుంటే పరిస్థితి అదుపుతప్పుతున్నట్టు కనిపిస్తోంది… ఇక గొలుసులతో కట్టేయాల్సిందే” అంటూ ఎద్దేవా చేశారు. కాగా, గొలుసులతో మానసిక రోగులని కట్టేస్తారన్న సంగతి తెలిసిందే.



Next Story

Most Viewed