రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు : మంత్రి జగదీష్ రెడ్డి

by  |
Jadheesh Reddy
X

దిశ, సూర్యా పేట : రాష్ట్ర ప్రజలందరూ పాడి పంటలతో సుభిక్షంగా వర్ధిల్లాలని కాంక్షిస్తున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం విజయ దశమి సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కలలను సాకారం చేసుకునేందుకు అందివచ్చిన వనరులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. నిరంతర ఉచిత విద్యుత్ సరఫరా, చేతికింద నీళ్లు, పచ్చని మాగణంతో ధాన్యపు సిరులు కురియాలని ఆయన ఆకాంక్షించారు. ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయంలో ప్రజలు భాగస్వామ్యం కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.



Next Story