- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
లేడీ సూపర్స్టార్ విజయశాంతి ఉద్వేగానికి లోనయ్యారు. తనను ఆదరిస్తున్న ప్రేక్షకులకు సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలిపారు. సరిలేరు నీకెవ్వరు సినిమాకు ఇంత గొప్ప విజయాన్ని అందించిర అభిమానులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పారు. 1979 కళ్ళుకల్ ఇరమ్, కిలాడి కృష్ణుడు సినిమాలతో తన నట ప్రస్థానం మొదలైనప్పటి నుంచి 2020 సరిలేరు నీకెవ్వరు వరకు ఆదరిస్తూ, గౌరవాన్ని అందించిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ చెప్పారు.
” ప్రజాజీవన పోరాటంలో నా ప్రయాణం… మళ్లీ మరో సినిమా చేసే సమయం, సందర్భం కల్పిస్తుందో లేదో నాకు కూడా తెలియదు.. ఇప్పటికి ఇక సెలవు. మనసు నిండిన మీ ఆదరణకు, నా ప్రాణప్రదమైన అభిమాన సైన్యానికి ఎప్పటికి నమస్సులు ” అంటూ థ్యాంక్స్ నోట్ ముగించారు. సూపర్స్టార్ కృష్ణ, మహేష్ బాబు, సరిలేరు నీకెవ్వరు దర్శకులు అనిల్ రావిపూడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు విజయశాంతి.
80 వ దశకం హీరోయిన్లలో విజయశాంతి నంబర్వన్గా ఎదిగారు. అటు గ్లామరస్గా కనిపిస్తూనే .. ఇటు సమాజానికి ఉపయోగపడే పాత్రలు చేస్తూ వచ్చారు విజయశాంతి. కర్తవ్యం, ప్రతిఘటన, ఒసేయ్ రాములమ్మ చిత్రాలతో హీరోలకు ధీటుగా లేడీ సూపర్ స్టార్గా అభిమానులకు దగ్గరయ్యారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లి ప్రజాసేవ చేస్తున్న ఆమె సరిలేరు నీకెవ్వరు సినిమాతో ఇండస్ట్రీలోకి ఇచ్చారు.