లోకేశ్ పై విజయసాయిరెడ్డి సెటైర్… బుద్ధా కౌంటర్

by  |
లోకేశ్ పై విజయసాయిరెడ్డి సెటైర్… బుద్ధా కౌంటర్
X

దిశ, ఏపీ బ్యూరో: టీడీపీ, వైఎస్ఆర్ సీపీ నేతల మధ్య ట్విట్టర్ వార్ ఆసక్తి రేపుతోంది. ట్విట్టర్ మాధ్యమంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై వైఎస్ఆర్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘తాడిపత్రి వచ్చి ఏం ఇరగదీశాడని ఆ పార్టీ కార్యకర్తలే విసుక్కుంటున్నారంట. 16 రకాల వంటకాలు చేయించుకుని సుష్టిగా భోజనం చేసి చెక్కేశాడని తెలుగు తమ్ముళ్లు తిట్టుకుంటున్నారు. పేరుకే పరామర్శలు, పలకరింపులు. టేస్టీ ఫుడ్ దొరుకుతుందంటే ఎంత దూరమైనా వెళ్లొస్తాడు మాలోకం’ అంటూ విమర్శించారు.

విజయసాయిరెడ్డి విమర్శలకు టీడీపీ నేత బుద్ధా వెంకన్న స్పందిస్తూ, ‘లోకేశ్ కార్యకర్త కోసం ఎంత దూరం అయినా వెళ్లడం చూసి వణుకుతున్నావ్ ఏంటీ? విజయసాయిరెడ్డి గారు. తాడిపత్రిలో లోకేశ్‌ తనతో పాటు తెచ్చుకున్న క్యారెజ్ అది కూడా డైటింగ్ లో భాగమైన ఆకుకూరల భోజనం తిన్నారు. దీనిని కూడా రాజకీయం చేయాలని చూస్తున్నారు చూడు.. అది మీ తింగరి మాలోకం జగన్ రేంజ్’ అని బుద్ధా వెంకన్న కౌంటర్‌ ఇచ్చారు.

‘మీ తింగరి మాలోకం అవినీతి సొమ్ము బొక్కడానికి తండ్రి శవాన్ని తాకట్టు పెట్టి సీఎం అవ్వాలి అనుకున్నాడు. ఓదార్పు అంటూ సోకాలు పెట్టాడు, పాదయాత్ర అంటూ మైన్స్, ల్యాండ్స్ పై కన్నేశాడు. అవినీతి సొమ్ము మేసి జైలుకైనా పోవడానికి సిద్ధం అనేది గన్నేరుపప్పే’ అని విమర్శించారు.

Next Story

Most Viewed