పేదలకు విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ సాయం

by  |
పేదలకు విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ సాయం
X

దిశ, న్యూస్ బ్యూరో: కరోనా లాక్ డౌన్‌తో కష్టాల పాలవుతున్న పేదలకు తెలంగాణ విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ అండగా నిలిచింది. ఆదివారం హైదరాబాద్‌లో 200 మంది పేదలకు బియ్యం, ఇతర నిత్యావసరాలు పంపిణీ చేసినట్లు అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. ఈ గడ్డు పరిస్థితుల్లో తామందించిన సరుకులు వారికి కనీసం వారం రోజులు ఉపయోగపడుతాయని అసోసియేషన్ రాష్ట్ర జనరల్ సెక్రటరి పి. అంజయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ టీఎస్ఎస్పీడీసీఎల్ అధ్యక్షుడు డి. వీరాస్వామి, ఎస్పీడీసీఎల్ వర్కింగ్ ప్రెసిడెంట్ హరీష్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి పి. అనిల్, బి. శ్రీనివాస్, నాగరాజు, గోపికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

tags : lock down, telangana, vidyuth account officers, poor people, rice distribution



Next Story