ఎక్కడా రాజీపడలేదు.. మీడియాపై ఉప రాష్ట్రపతి ప్రశంసలు

by  |
ఎక్కడా రాజీపడలేదు.. మీడియాపై ఉప రాష్ట్రపతి ప్రశంసలు
X

దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. రోజూ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అవుతూ, విజృంభిస్తోంది. కాగా ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ప్రజలకు నిత్యం సమాచారం చేస్తూ, కరోనాపై ఎదురొడ్డి పోరాడుతున్న జర్నలిస్టులపై భారత ఉపరాష్ట్రప్రతి వెంకయ్య నాయుడు ప్రశంసలు చేశారు. ప్రజలకు ఎప్పటికప్పుడూ సమాచారం అందజేయడంలో, జర్నలిస్టులు ఎక్కడా కూడా రాజీపడలేదని అభినందించారు. ప్రజల్లో భాయాందోళనలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. మహమ్మారి నిర్వహణ అంశం పార్లమెంట్‌ పరిశీలనలో ఉందని స్పష్టం చేశారు.

Next Story