మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్‌కు ఉపరాష్ట్రపతి ఫోన్

by Chintha Aamani |

<p>దిశ, ఆదిలాబాద్ : నిర్మల్ పురపాలక సంఘం మాజీ చైర్‌పర్సన్ అయ్యన్నగారి భూలక్ష్మికి భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఫోన్ చేశారు. శనివారం మధ్యాహ్నం ఆయన భూలక్ష్మికి ఫోన్ చేసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే నిర్మల్ జిల్లాలో కరోనా పరిస్థితిపై కూడా ఆరా తీశారు. అధికార యంత్రాంగం కరోనా నియంత్రణకు చేపడుతున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ ఆపత్కాలంలో కేంద్రం అమలు చేస్తున్న కరోనా కట్టుబాట్లను పాటించడంతో పాటు, ప్రజలు ఆచరించేలా చూడాలని ఆయన కోరారు. [&hellip;]</p>

మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్‌కు ఉపరాష్ట్రపతి ఫోన్
X

దిశ, ఆదిలాబాద్ :

నిర్మల్ పురపాలక సంఘం మాజీ చైర్‌పర్సన్ అయ్యన్నగారి భూలక్ష్మికి భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఫోన్ చేశారు. శనివారం మధ్యాహ్నం ఆయన భూలక్ష్మికి ఫోన్ చేసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే నిర్మల్ జిల్లాలో కరోనా పరిస్థితిపై కూడా ఆరా తీశారు. అధికార యంత్రాంగం కరోనా నియంత్రణకు చేపడుతున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ ఆపత్కాలంలో కేంద్రం అమలు చేస్తున్న కరోనా కట్టుబాట్లను పాటించడంతో పాటు, ప్రజలు ఆచరించేలా చూడాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అయ్యన్నగారి భూమయ్య ఉన్నారు.

Next Story