కన్నీరు పెట్టుకున్న ఉపరాష్ట్రపతి

by  |
కన్నీరు పెట్టుకున్న ఉపరాష్ట్రపతి
X

దిశ, వెబ్‌డెస్క్ : ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాజ్యసభలో కంట తడి పెట్టారు. సభలో ఎంపీల ప్రవర్తన‌పై కలత చెందిన ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. ఈ రోజు కూడా సభా కార్యక్రమాలకు విపక్ష సభ్యులు అంతరాయం కలిగించారు. దీంతో రాజ్యసభను చైర్మన్ గంట సేపు వాయిదా వేశారు.

లోక్ సభ వాయిదా..

లోక్ సభ సమావేశాలు నిరవధికంగా వాయిదా వేశారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 13 వరకు జరగాల్సిన సమావేశాలు, షెడ్యూల్ కంటే ముందే ముగిసాయి. విపక్షాల ఆందోళన నేపథ్యంలో లోక్ సభను నిరవధికంగా వాయిదా వేసినట్టు తెలిపారు. ఇప్పటి వరకు లోక్ సభా సమావేశాలు 17 రోజులు జరిగాయి. కొత్త వ్యవసాయ చట్టాలు, పెగసెస్‌పై చర్చకు పట్టుబడుతూ వచ్చిన విపక్షాలు రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదానికి మాత్రం సహాకరించాయి.


Next Story

Most Viewed