‘జగన్నాథ రథయాత్రకు అనుమతినివ్వాలి’

by  |
‘జగన్నాథ రథయాత్రకు అనుమతినివ్వాలి’
X

దిశ, హైదరాబాద్: హైదరాబాద్ భగవాన్ జగన్నాథ రథయాత్రకు ఎదురవుతున్న అవరోధాలను తొలగించాలని.. విశ్వ హిందూ పరిషత్ కేంద్రీయ మహా మంత్రి మిలింధ్ పరాండె రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పూరీ క్షేత్రంలో వందల సంవత్సరాలుగా జగన్నాథ రథయాత్రలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉత్సవాలు జరుగుతాయని ఆయన గుర్తు చేశారు. అదే సంప్రదాయం ప్రకారం హైదరాబాద్‌లో కూడా రథయాత్రను నిర్వహించాలని ప్రభుత్వానికి సూచించారు. కొవిడ్ మహమ్మారి ఉన్నప్పటికీ సరైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా రథయాత్ర నిర్వహించవచ్చని మిలింధ్ పరాండె అభిప్రాయపడ్డారు. ప్రతీ ఏటా హైదరాబాద్‌లో కూడా జనన్నాథ రథయాత్రం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

Next Story

Most Viewed