కేసీఆర్ నమ్మించి మోసం చేశారు: వీహెచ్

by  |
Congress leader VH
X

దిశ, వెబ్‌డెస్క్: టీఆర్ఎస్ పార్టీ విలీనంపై కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీని కేసీఆర్ నమ్మించి మోసం చేశారని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ వ్యాఖ్యానించారు. దేశాన్ని లూటీ చేసిన వాళ్లను బీజేపీ చేర్చుకుంటోందన్న వీహెచ్.. బీజేపీలో చేరితే పాప పరిహారమవుతోందని చెప్పడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకొని సీఎం కేసీఆర్ తప్పు చేశారని, రాష్ట్రంలో బీజేపీ బలం పెరగడానికి ఆయనే కారణమని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ శనివారం ఇందిరాపార్క్‌ ధర్నా చౌక్‌లో కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన రైతు దీక్షలో వీహెచ్‌ పై విధంగా స్పందించారు.


Next Story

Most Viewed