కర్తవ్యాన్ని నిబద్ధతతో నిర్వరిస్తా- ప్రొటైం చైర్మన్ భూపాల్ రెడ్డి

by  |
కర్తవ్యాన్ని నిబద్ధతతో నిర్వరిస్తా- ప్రొటైం చైర్మన్ భూపాల్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ శాసన మండలిలోని చైర్మన్ ఛాంబర్ లో ప్రొటెం చైర్మన్ గా శుక్రవారం వెన్నవరం భూపాల్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా భూపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రొటెం చైర్మన్ గా అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తనకు ఇచ్చిన కర్తవ్యాన్ని నిబద్ధతతో నిర్వర్తిస్తానని చెప్పారు. ఎల్లవేళలా ప్రజా ప్రతినిధులకు, ప్రజలకు అందుబాటులో ఉంటూ తన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని భూపాల్ రెడ్డి తెలిపారు. శాసన సభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ,హోంమంత్రి మహమూద్ అలీ, తెలంగాణ లెజిస్లేటివ్ సెక్రెటరీ డా.నర్సింహా చార్యులు తదితరులు భూపాల్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి మెదక్,సంగారెడ్డి జిల్లా టి ఆర్ యస్ పార్టీ నేతలు,భూపాల్ రెడ్డి కుటుంబ సభ్యులు తదితరులు హాజరయ్యారు.

Next Story