బోధన్ ఏఎంసీ చైర్మన్‎గా వెంకటేశ్వర దేశాయ్‌ నియామకం

by  |
బోధన్ ఏఎంసీ చైర్మన్‎గా వెంకటేశ్వర దేశాయ్‌ నియామకం
X

దిశ, బోధన్: బోధన్ ఏఎంసీ చైర్మన్‎గా టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, అడ్వకేట్ వెంకటేశ్వర దేశాయ్‌ని నియమించినట్టు నియోజకవర్గ ఎమ్మెల్యే షకీల్ తెలిపారు. ఆదివారం బోధన్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన ఏఎంసీ చైర్మన్‌ వెంకటేశ్వర దేశాయ్‌ని బోధన్ ఎమ్మెల్యే షకీల్, పార్టీ శ్రేణులు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీసీసీబీ డైరెక్టర్ గిర్దావార్ గంగారెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు బుద్దె రాజేశ్వర్, తదితర నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed