న్యూజిలాండ్ సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. రోహిత్‌కే అవకాశం

by  |
న్యూజిలాండ్ సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. రోహిత్‌కే అవకాశం
X

దిశ, వెబ్‌డెస్క్: న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరగనున్న టీ20 సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. విరాట్ కోహ్లీ టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో.. రోహిత్ శర్మకు కెప్టెన్ బాధ్యతలను అప్పగించారు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్‌ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్‌లో బ్యాటింగ్‌తో చెలరేగిపోయిన రుతురాజ్ గైక్వాడ్, వెంకటేషన్ అయ్యార్‌కు జట్టులో అవకాశం కల్పించారు.

భారత జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్(వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, వెంకటేష్ అయ్యర్, యజ్వేంద్ర చహల్, అశ్విన్, అక్షర్ పటేల్, అవేష్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చహర్, హర్షల్ పటేల్, సిరాజ్


Next Story

Most Viewed