ఉపరాష్ట్రపతి వెంకయ్య విచారం..

by  |
ఉపరాష్ట్రపతి వెంకయ్య విచారం..
X

దిశ, వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీ, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం స్తంభించడమే కాకుండా, ప్రభుత్వ ఆస్తులు, పంట పొలాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీనిపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు విచారం వ్యక్తం చేశారు. అకాల వర్షాల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు వెంకయ్య సానుభూతి తెలిపారు.

అలాగే నిరాశ్రయులు, గాయాల పాలైన వారిని ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. అదే విధంగా ఆయా ప్రభుత్వాలు జారీచేసే సూచనలు, హెచ్చరికలను విధిగా పాటించాలని ప్రజలకు సూచించారు.


Next Story

Most Viewed