దేశ ప్రజలకు దసరా శుభాకాంక్షలు : వెంకయ్యనాయుడు

by  |
దేశ ప్రజలకు దసరా శుభాకాంక్షలు  : వెంకయ్యనాయుడు
X

దిశ, వెబ్‌డెస్క్ : విజయదశమి పండుగను పురస్కరించుకుని దేశ ప్రజలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దసరా పండుగను జరుపుకుంటామని చెప్పారు.

దేశంలో కరోనా వ్యాప్తి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నందున ప్రజలందరూ కొవిడ్ నిబంధనలు పాటిస్తూ సంతోషంగా పండుగను జరుపుకోవాలని సూచించారు. ఈ దసరా పండుగ ప్రజలందరి జీవితాల్లో శాంతి, శ్రేయస్సు చేకూర్చాలని ఆయన ఆకాంక్షించారు.

Next Story