- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు విజయవాడ నగరం నిర్లక్ష్యానికి గురైందని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ప్రజల సొమ్మును టీడీపీ నాయకులు విచ్చలవిడిగా దోపిడీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విజయవాడలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. బోండా ఉమా, ఆయన కుటుంబం అరాచకాలు తొందరలోనే బయటపడతాయన్నారు. ఈఎస్ఐ స్కామ్లో ఆధారాలతో సహా అడ్డంగా దొరికిన అచ్చెన్నాయుడికి పట్టిన గతే బోండా ఉమాకు పడుతుందని హెచ్చరించారు.
దోపిడీ చేసినవారు ఎవరూ తప్పించుకోలేరని, చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుందన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు సంక్షేమ కార్యక్రమాలకు అడ్డుపడుతున్నాడని, హైదరాబాద్లో కూర్చొని కుట్రలు చేస్తున్నాడని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ విజయవాడ అభివృద్ధిపై ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నారన్నారు.
Next Story