- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీకి వెళ్లాలంటే.. సాయంత్రం 7 గంటల వరకే
by Shyam |
<p>దిశ, నల్లగొండ: జిల్లా మీదుగా ఏపీకి వెళ్లే ప్రయాణికులకు ఇకపై ఉదయం 7.00 గంటల నుంచి సాయంత్రం 7.00 గంటల వరకు మాత్రమే సరిహద్దు వద్ద అనుమతిస్తారని జిల్లా ఎస్పీ ఏ.వి.రంగనాథ్ తెలిపారు. సాయంత్రం 7 గంటల తర్వాత సరిహద్దుల్లో వాహనాలను నిలిపివేస్తున్నట్లు గుంటూరు జిల్లా ఎస్పీ తనకు సమాచారమిచ్చారని రంగనాథ్ వెల్లడించారు. ఇక ఇదే సమయంలో నాగార్జున సాగర్ – మాచర్ల రోడ్డును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ రోడ్డుగా గుర్తించినందునా ఆ మార్గంలో ఎలాంటి ప్రజా […]</p>

X
దిశ, నల్లగొండ: జిల్లా మీదుగా ఏపీకి వెళ్లే ప్రయాణికులకు ఇకపై ఉదయం 7.00 గంటల నుంచి సాయంత్రం 7.00 గంటల వరకు మాత్రమే సరిహద్దు వద్ద అనుమతిస్తారని జిల్లా ఎస్పీ ఏ.వి.రంగనాథ్ తెలిపారు. సాయంత్రం 7 గంటల తర్వాత సరిహద్దుల్లో వాహనాలను నిలిపివేస్తున్నట్లు గుంటూరు జిల్లా ఎస్పీ తనకు సమాచారమిచ్చారని రంగనాథ్ వెల్లడించారు. ఇక ఇదే సమయంలో నాగార్జున సాగర్ – మాచర్ల రోడ్డును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ రోడ్డుగా గుర్తించినందునా ఆ మార్గంలో ఎలాంటి ప్రజా రవాణా, వాహనాలను ఏపీ పోలీసులు అనుమతించడం లేదన్న విషయాన్ని ప్రయాణికులు గమనించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సరుకు రవాణా, అత్యవసర సేవల వాహనాలు మినహా మిగిలిన అన్ని ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించే వారికి విధిగా పాస్ ఉండాలని అన్నారు.
Next Story






