వాహనాలను రోడ్ల మీదకు రానివ్వకండి

by  |

దిశ, మెదక్ : కరోనా నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా లాక్‌డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. బుధవారం సంగారెడ్డి పట్టణంలో కొనసాగుతున్న లాక్ డౌన్ తీరును ఆయన పర్యవేక్షించారు. అత్యవసరం లేకుండా ఎవరైనా రోడ్లమీదకు వస్తే వారిని అడ్డుకుని, వెంటనే వాహనాలను సీజ్ చేయాలన్నారు. అలాగే ఎక్కడి వాహనాలను అక్కడే కట్టడి చేయాలని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతున్నందున ప్రజలెవరూ రోడ్ల మీదకు రాకూడదని, ఇంటికే పరిమితం కావాలని ఎస్పీ సూచించారు .

Tags: carona, lockdown, stop vehicles, sp chandra shekar reddy



Next Story

Most Viewed