ఇంటి వద్దకే కూరగాయలు

by  |
ఇంటి వద్దకే కూరగాయలు
X

దిశ, మహబూబ్ నగర్: పాత బస్టాండులోని కూరగాయాల మార్కెట్ తాత్కాలికంగా తేరుమైదానంలోకి మారుస్తున్నట్లు మున్సిపల్‌ కమిషనర్ నరసింహ్మ తెలిపారు. శనివారం సాయంత్రం పాత కూరగాయాల మార్కెట్‎లోని‌ వ్యాపారులతో మున్సిపల్‌ కమిషనర్ నరసింహ్మ, తహసీల్దార్ మంజుల పట్టణ ఎస్ఐ సత్యనారాయణ సమావేశం నిర్వహించారు. కరోనా వైరస్ నివారణకు లాక్ డౌన్ నేపథ్యంలో కూరగాయలు కొనడానికి వచ్చు వినియోగదారులు ఈ ఇరుకైనా మార్కెట్‎లో దుకాణాల ముందు గుమ్మిగూడుతున్నారని తెలిపారు. ఇలా గుమ్మిగూడటంతో కరోనా వైరస్ తొందరగా వ్యాపించే అవకాశం ఉందన్నారు. ప్రజా ఆరోగ్య దృష్ట్యా పాత కూరగాయల మార్కెట్‎లోని దుకాణాలను ఇక్కడ నుంచి తొలగించి తేరు మైదానంలో ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు త్వరలో ప్రతి కాలనీలో కూరాగాయల దుకాణాలను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.

Next Story