దుష్యంత్‌కు కరోనా నెగెటివ్

by Shamantha N |   (  Updated:2020-03-21 06:03:28  IST  )

<p>న్యూఢిల్లీ: రాజస్తాన్ మాజీ సీఎం వసుంధర రాజె, ఆమె కుమారుడు, బీజేపీ ఎంపీ దుష్యంత్ సింగ్‌లకు నిర్వహించిన పరీక్షల్లో కరోనావైరస్ నెగెటివ్‌గా తేలింది. కరోనావైరస్ పాజిటివ్‌గా తేలిన సింగర్ కనికా కపూర్‌ హాజరైన పార్టీలో పాల్గొన్నామని వెల్లడించాక స్వచ్ఛందంగా ఏకాంతవాసంలోకి వెళ్లిన విషయం తెలిసిందే. దీనికి ముందు దుష్యంత్ సింగ్ అనేక మంది ఎంపీలు, రాష్ట్రపతి సహా కేంద్రమంత్రులను కలవడంతో నేతల్లో కరోనా కలవరం మొదలైంది. తాజాగా, తల్లీకొడుకులిద్దరికి కరోనావైరస్ సోకలేదని తేలడంతో ఎంపీలు, కేంద్రమంత్రులు ఊపిరి [&hellip;]</p>

దుష్యంత్‌కు కరోనా నెగెటివ్
X

న్యూఢిల్లీ: రాజస్తాన్ మాజీ సీఎం వసుంధర రాజె, ఆమె కుమారుడు, బీజేపీ ఎంపీ దుష్యంత్ సింగ్‌లకు నిర్వహించిన పరీక్షల్లో కరోనావైరస్ నెగెటివ్‌గా తేలింది. కరోనావైరస్ పాజిటివ్‌గా తేలిన సింగర్ కనికా కపూర్‌ హాజరైన పార్టీలో పాల్గొన్నామని వెల్లడించాక స్వచ్ఛందంగా ఏకాంతవాసంలోకి వెళ్లిన విషయం తెలిసిందే. దీనికి ముందు దుష్యంత్ సింగ్ అనేక మంది ఎంపీలు, రాష్ట్రపతి సహా కేంద్రమంత్రులను కలవడంతో నేతల్లో కరోనా కలవరం మొదలైంది. తాజాగా, తల్లీకొడుకులిద్దరికి కరోనావైరస్ సోకలేదని తేలడంతో ఎంపీలు, కేంద్రమంత్రులు ఊపిరి పీల్చుకున్నట్టు తెలుస్తున్నది.

tags : coronavirus, dushyant singh, negative, tests, kanika kapoor

Next Story