వరుణ్ ధావన్ పెళ్లి అయిపోయిందా?

by  |
వరుణ్ ధావన్ పెళ్లి అయిపోయిందా?
X

దిశ, వెబ్‌డెస్క్ : బాలీవుడ్ సీనియర్ హీరోయిన్స్ కర్వా చౌత్ సెలబ్రేషన్స్‌తో కలర్‌ఫుల్‌గా కనిపించారు. కాజోల్, రవీనా టాండన్, బిపాసా బసు, శిల్పా శెట్టి, ప్రియాంక చోప్రా లాంటి నటుల ఎకౌంట్స్ కర్వా చౌత్ పోస్టింగ్స్‌తో నిండిపోయాయి. అయితే అనిల్ కపూర్ సతీమణి సునీత కపూర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలు ఒకింత కన్ఫ్యూజన్ క్రియేట్ చేశాయి. సెలబ్రేషన్స్ సాఫీగానే సాగినా.. ఈ వేడుకకు వరుణ్ ధావన్ గర్ల్ ఫ్రెండ్ నటాషా దలాల్ అటెండ్ కావడమే ఇందుకు కారణం.

కర్వా చౌత్ పండుగ రోజున పెళ్లయిన ఆడవాళ్లు భర్త ఆరోగ్యం కోసం రోజంతా ఉపవాసం చేసి సామూహిక పూజలు చేస్తుంటారు. అయితే ఈ కార్యక్రమంలో వరుణ్ ధావన్ గర్ల్ ఫ్రెండ్ పాల్గొనడం పట్ల వరుణ్ మ్యారేజ్ అయిపోయిందా? అనే ప్రశ్న తలెత్తుతోంది. సునీత కపూర్ ఇంట్లో జరిగిన వేడుకలకు శిల్పా శెట్టి, మహీప్ కపూర్, భావనా పాండేతో పాటు మరింత మంది సెలెబ్రిటీలు హాజరుకాగా.. భావన ఈ వేడుకలకు సంబంధించిన పిక్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటో చూసిన నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు. ఏంటి పెళ్లి అయిపోయిందా? లేక ఎలాగూ పెళ్లి అవుతుంది కదా? అని వరుణ్ ఆరోగ్యం కోసం పూజలు చేస్తుందా? అని కామెంట్స్ చేస్తున్నారు. కొందరు ఈ ఫొటో చూసి నవ్వుకుంటుంటే.. ఇంకొందరు నటాషా నువ్వెంత మంచిదానివి.. వరుణ్ గురించి ఇప్పటి నుంచే ఎంత శ్రద్ధ తీసుకుంటున్నావు అని పొగిడేస్తున్నారు.

కాగా వరుణ్, నటాషాలు మే నెలలోనే డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాల్సింది. కానీ కరోనా కారణంగా పెళ్లి వాయిదా పడింది. మరి ఈ కర్వా చౌత్ సెలబ్రేషన్స్‌లో పాల్గొని నటాషా ఏం మెసేజ్ ఇవ్వాలనుకుందో మాత్రం అర్ధం కావట్లేదు.


Next Story

Most Viewed