నానావతికి 80 ఏళ్ల విప్లవ కవి

by  |
నానావతికి 80 ఏళ్ల విప్లవ కవి
X

న్యూఢిల్లీ: విప్లవ కవి వరవరరావును నానావతి ఆస్పత్రికి తరలించారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వరవరరావును సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్ హెచ్ ఆర్సీ ఆదేశించింది. అదేవిధంగా అందుకు అయ్యే ఖర్చును కూడా ప్రభుత్వమే భరించాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆయనను నానావతి ఆస్పత్రికి తరలించినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే.. భీమా కొరేగావ్ కేసులు విచారణ ఖైదీగా ఏడాదిన్నర సంవత్సరం నుంచి మహారాష్ట్రలోని తలోజా జైలులో ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే.. ఇటీవల ఆయనకు కరోనా సోకి తీవ్ర ఇబ్బంది పడుతుండడంతో ముంబైలోని నానావతి ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.



Next Story