- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: ఉత్తరప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది. సొంత బావ తన మరదలిని అతి దారుణంగా చంపిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. అయితే మృతురాలు ప్రముఖ క్యాన్సర్ నిపుణుడు, మాజీ ఎమ్మెల్యే రజనీకాంత్ దత్తా కోడలు డాక్టర్ సప్నా కావడం చర్చనీయాంశంగా మారింది. వివరాలలోకి వెళితే కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే రజనీకాంత్ దత్తా కోడలు డాక్టర్ సప్నా వారణాసిలోని మహమూర్గంజ్ ప్రాంతానికి చెందిన స్వప్న స్థానిక ఆస్పత్రిలో డాక్టర్ గా పనిచేస్తోంది. ఈ నేపథ్యంలోనే రజనీకాంత్ దత్తా పెద్ద కొడుకు అనిల్ దత్తా తో స్వప్నకు విబేధాలు ఉన్నాయి.
ఆమె అనిల్ ని ఎప్పుడు నువ్వు కాపురానికి పనికిరావు, నపుంసకుడవు అంటూ కామెంట్ చేస్తుండేది. ఇక ఆ మాటలకూ కోపంతో రగిలిపోయిన అనిల్ మరదలిని రెండు రోజుల క్రితం ఆమెను ఇంట్లోనే సుత్తితో తలపై మోది అతి దారుణంగాహత్య చేశాడు. హత్య అనంతరం ఓ వీడియో క్లిప్ను సోషల్మీడియాలో పోస్ట్ చేశాడు. “అనారోగ్యంతో ఉన్న నా తల్లిదండ్రులను చూసేందుకు వెళ్తుండగా సప్నా నన్ను నపుంసుకుడివంటూ నిందించింది.. గతంలో నాతో పాటు నా తమ్ముడిని ఇలాగే నిందించింది. అందుకే తట్టుకోలేకే ఆమెను చంపేశా” అని అనిల్ ఆ వీడియోలో పేర్కొన్నాడు. అయితే కుటుంబ వివాదల మద్యే ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న అనిల్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.