తొలి రౌండ్ పూర్తి… ఆధిక్యంలో ఎవరున్నారంటే..?

by  |
తొలి రౌండ్ పూర్తి… ఆధిక్యంలో ఎవరున్నారంటే..?
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అటు అధికార పార్టీ, ఇటు బీజేపీ మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. టీఆర్ఎస్ కు ప్రెస్టీజియస్ మ్యాటర్ కాగా, బీజేపీకి బలపరిక్షగా మారింది. ఈ తరుణంలో ఫలితాలపై అంతటా ఆసక్తి నెలకొంది. కాగా తొలి రౌండ్ కౌంటింగ్ పూర్తయ్యే సమయానికి టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవి 1,044 ఓట్ల ఆధిక్యంతో ముందంజలో ఉన్నారు. 17,429 ఓట్లతో ఆమె ముందంజలో నిలిచారు. 16,385 ఓట్లతో రెండో స్థానంలో బీజేపీ అభ్యర్థి రామచందర్ రావు, 8,357 ఓట్లతో మూడో స్థానంలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు, 5,501 ఓట్లతో నాలుగో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డి ఉన్నారు.


Next Story

Most Viewed