గోడ మెరిసే..వనజీవి మురిసే..

by  |
గోడ మెరిసే..వనజీవి మురిసే..
X

దిశ‌ప్ర‌తినిధి, ఖ‌మ్మం: స‌మాజానికి వివిధ రంగాల్లో సేవ‌లందించిన మ‌హ‌నీయుల ఉన్న‌తిని, చ‌రిత్ర‌ను తెలిపేందుకు వీలుగా కొద్ది రోజుల క్రితం ఖ‌మ్మం కార్పొరేష‌న్ వారు వాల్‌పై పెయింటింగ్ వేయించారు. ఇందులో ప‌చ్చ‌ద‌నం కోసం ఏండ్లుగా శ్ర‌మిస్తూ, చైత‌న్యం నింపుతున్న పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య చిత్రం కూడా ఉంది.

కాగా ఖమ్మంలో శుక్రవారం బైక్ పై వెళుతుండగా.. వాల్ పై ఉన్న తన ఫోటోలను వనజీవి రామయ్య చూశారు. కాగా ఆయన పెయింటింగ్‌ను రామయ్య ఆశ్చర్యంగా చూస్తుండగా దిశ మీడియా ప్రతినిధి ఫోటోలు తీశారు. ఇప్పుడు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Next Story

Most Viewed