- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్ : విశాఖపట్నం జిల్లా జి.మాడుగుల మండలం మగతపాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం రాత్రి వ్యాన్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పెళ్లి కొడుకుతో పాటు మరో మహిళ మృతి చెందింది. మరో 9 మంది పరిస్థితి విషమంగా ఉండగా.. 35 మందికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను జి.మాడుగుల ఆస్పత్రికి తరలించారు.
వివరాల్లోకి వెళ్తే.. గూడెంకొత్తవీధి మండలం రింతాడ పంచాయతీ, కడుగుల గ్రామానికి చెందిన వంతాల శివ అనే యువకుడు.. వారం రోజుల క్రితం మగతపాలెం గ్రామానికి చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు. కడుగుల నుంచి వ్యాన్లో నవ వధూవరులు, వారి బంధువులు శుభకార్యం నిమిత్తం గురువారం మగతపాలెం వచ్చారు. అక్కడి నుంచి శుక్రవారం రాత్రి 45 మంది వ్యాన్లో తిరుగు పయనమయ్యారు. మగతపాలెం సమీపంలోని ఘాట్రోడ్డుకు వచ్చేసరికి వ్యాన్ అదుపుతప్పి బోల్తా పడింది. ఇదే వ్యాన్లో ఉన్న పెళ్లి కొడుకుతో పాటు మరో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.