ఘోర రోడ్డు ప్రమాదం… ఆరుగురు మృతి

by  |
ఘోర రోడ్డు ప్రమాదం… ఆరుగురు మృతి
X

దిశ,వెబ్‌డెస్క్: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. భిండ్ జిల్లా మెహగావ్‌లో వ్యాన్‌ను ఓ వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా మరో ఐదుగురికి తీవ్రగాయలయ్యాయి. నేపాల్ నుంచి మహారాష్ట్రకు వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులు మహారాష్ట్రలో కాపలాదారులుగా పనిచేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.



Next Story