- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ ప్రతినిధి, కరీంనగర్: న్యాయవాద దంపతుల హత్య కేసులో ఏ1 నిందితుడు కుంట శ్రీనివాస్ నేర చరిత్ర గురించి రామగుండం సీపీ పీఆర్వో ప్రవీణ్తో ప్రస్తావించిన గట్టు వామన్ రావు ఆడియో వైరల్ అవుతోంది. 2018లోనే మంథని మాజీ ఉప సర్పంచ్ ఇనుముల సతీష్ను హతమార్చి ఆనవాళ్లు లేకుండ మిస్సింగ్ కేసుగా ఉండేలా జాగ్రత్త పడాలంటూ సూపారీ గ్యాంగ్ లీడర్తో మాట్లాడడని వామన్రావు పీఆర్వోకు వివరించారు. మంథనిలో జరుగుతున్న పరిణామాలను సీపీ దృష్టికి తీసుకువెళ్ళాలని కోరారు. పోలీసులంటే నాకు గౌరవం ఉంది కాబట్టే నేను హైకోర్టులో రిట్ వేయలేదని, ఎన్ఐఏ పలువురు పోలీసు అధికారుల నుండి రికవరీ చేయాలనుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటం చేశానని వామన్రావు వివరించారు. కుంట శ్రీనివాస్ మాట్లాడిన ఆడియో రికార్డు మీకు పంపిస్తున్నాను సీపీకి పంపించాలని పీఆర్వోను వామన్ రావు కోరారు.
సతీష్ మర్డర్ ప్లాన్ కోసం 10లక్షలు అడ్వాన్స్గా ఇచ్చారని కూడా తెలిపిన వామన్ రావు, ఈ రోజు శ్రీధర్ బాబు ఎన్నికల ప్రచారం చేస్తున్నారంటే అది వామన్రావు, ఇనుముల సతీష్ చొరవేనన్నారు.
అది కుంట శ్రీనివాస్ వాయిసే
మూడేళ్ల క్రితం మంథని అసెంబ్లీ ఎన్నికల సమయంలో కుంట శ్రీనివాస్ ఇనుముల సతీష్ ఆనవాల్లు లేకుండా హతం చేయాలన్న స్కెచ్ వేసినట్టుగా వైరల్ అయిన ఆడియో రికార్డులోని వాయిస్ ఆయనదేనని సైంటిఫిక్గా నిర్దారణ అయినట్టుగా తెలుస్తోంది. ఈ వాయిస్ రికార్డులో ఇనుముల సతీష్ ను ఆనవాళ్లు లేకుండా హతమార్చినట్టయితే రూ. 50 లక్షల డీల్ కుదుర్చుకున్నట్టు ఆ ఆడియోలో ఉంది. అంతేకాకుండా కుంట శ్రీనివాస్ ఎమ్మెల్సీ కవిత గురించి కూడా మాట్లాడటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.