మానసిక వికలాంగుల పాఠశాలలో పండ్లు, బిస్కెట్లు పంపిణీ

by  |
Wajpayee1
X

దిశ, వనస్థలిపురం: ప్రపంచం గర్వించదగ్గ వ్యక్తి అటల్ బిహారీ వాజ్ పేయీ అని కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి అన్నారు. బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధి గౌతమి నగర్ లోని శాంతినికేతన్ మానసిక వికలాంగుల పాఠశాలలో వాజ్ పేయీ జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వనపల్లి శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ డివిజన్ అధ్యక్షుడు నవ కిషోర్ రెడ్డి, సీనియర్ నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed