టీకాకు మరో ఏడాది :డబ్ల్యూహెచ్‌వో

by  |
టీకాకు మరో ఏడాది :డబ్ల్యూహెచ్‌వో
X

దిశ వెబ్‎డెస్క్: కరోనాను అంతం చేసే టీకా అందరికీ అందుబాటులోకి రావాలంటే కనీసం మరో ఏడాది పడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) స్పష్టం చేసింది. కరోనా టీకా ట్రయల్స్ అన్ని పూర్తి అయిన తర్వాత కఠిన పరీక్షలుంటాయని.. అవి ముగిసే సరికి వచ్చే ఏడాది సగం గడిచిపోయే అవకాశముందని డబ్ల్యూహెచ్‎వో ప్రతినిధి మార్గరేట్ హారిస్ జెనీవాలో జరిగిన ఓ సమావేశంలో పేర్కొన్నారు. టీకా క్లినికల్ ట్రయల్స్ మూడో దశ ట్రయల్స్ దీర్ఘకాలం సాగాల్సిన అవసరముందని.. దీంతో సదరు వ్యాక్సిన్ సమర్థత, సురక్షితత్వంపై ఖచ్చితమైన అవగాహన ఉంటుదని తెలిపారు.

Next Story

Most Viewed