ఆధార్ లేకపోయినా వ్యాక్సిన్.. ఏపీ ప్రభుత్వం డెసిషన్

by  |
ఆధార్ లేకపోయినా వ్యాక్సిన్.. ఏపీ ప్రభుత్వం డెసిషన్
X

దిశ, వెబ్‌డెస్క్: వృద్ధులకు ఆధార్ కార్డు లేకపోయినా వ్యాక్సిన్ ఇస్తామని ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు హైకోర్టులో మెమో దాఖలు చేసింది. వ్యాక్సినేషన్‌పై హైకోర్టులో విచారణ సందర్భంగా.. రెండు రోజుల్లో వృద్ధులకు వ్యాక్సిన్ పూర్తిచేస్తామని స్పష్టం చేసింది. కరోనా థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, దీని కోసం ముందస్తు ఏర్పాట్లు చేస్తు్న్నామంది.

థర్డ్ వేవ్‌లో చిన్నపిల్లలకు కరోనా వస్తుందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని, అయినా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నామని ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఇప్పటివరకు 1955 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదవ్వగా.. 109 మంది మృతి చెందినట్లు తెలిపింది. ప్రస్తుతం 1300 బ్లాక్ ఫంగస్ యాక్టివ్ కేసులు ఉన్నాయంది.


Next Story

Most Viewed