తెలంగాణలో 2 కోట్లా మైలురాయి‌ని దాటినా టీకా

by  |
Covid-19 vaccine wastage:
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో టీకా పంపిణీ రెండు కోట్ల మైలురాయిని దాటినది. రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సినేషన్ చాలా స్పీడ్‌గా నడుస్తుంది. ఇప్పటివరకు 2 కోట్లకు పైగా టీకాలు పంపిణీ చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. దీనిలో ఒక కోటి 50 లక్షలు మొదటిడోస్, మరో యాభై లక్షల మంది రెండో డోస్ కూడా పూర్తి చేసుకున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 51 శాతం మంది రెండు డోసులు తీసుకోగా, అసలు ఇప్పటి వరకు కనీసం ఒక్క డోస్ కూడా తీసుకొని వారు 49 శాతం మంది ఉన్నారు. ఇకనుంచి రాష్ట్ర వ్యాప్తంగా 18 ఏళ్ల పైబడిన వారందరికీ స్పెషల్ వ్యాక్సినేషన్ పేరిట అన్ని గ్రామాల్లో మొబైల్ వ్యాక్సినేషన్ ఏర్పాటుచేసి ప్రతిరోజు సగటున మూడు లక్షల మంది కంటే తక్కువ కాకుండా టీకాలు పంపిణీ చేసేందుకు ఆరోగ్యశాఖ కసరత్తు ప్రారంభించింది.


Next Story