కేంద్ర ప్రభుత్వంపై వీహెచ్ ఫైర్

by  |
కేంద్ర ప్రభుత్వంపై వీహెచ్ ఫైర్
X

రాజ్యాంగ హక్కులను బీజేపీ కాలరాస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు అన్నారు. ధర్నా చౌక్ వద్ద సోమవారం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీహెచ్ మాట్లాడుతూ.. దమ్ముంటే పార్లమెంట్‌లో రిజర్వేషన్ల బిల్లు పెట్టాలని బీజేపీకి సవాల్ విసిరారు. రిజర్వేషన్లను ఎవరు వ్యతిరేకిస్తారో చూస్తానన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు రంగంలో విలీనం చేసి కేంద్రం వాటిని నిర్వీర్యం చేస్తుందని ఆయన విమర్శించారు. రిజర్వేషన్ల అంశంపై కేసీఆర్ నోరు మెదపాలని ఈ సందర్భంగా వీహెచ్ డిమాండ్ చేశారు.

Advertisement
Next Story

Most Viewed