డీజీపీ, ఈసీని కలవనున్న ఉత్తమ్ బృందం

by  |
 డీజీపీ, ఈసీని కలవనున్న ఉత్తమ్ బృందం
X

దిశ, వెబ్ డెస్క్ : దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి టీఆరెస్ లో చేరుతారంటూ జరుగుతోన్న ప్రచారాన్ని కాంగ్రెస్ శ్రేణులు ఖండించాయి. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలంటూ కొద్దిసేపటి క్రితం చెరుకు శ్రీనివాస్ తొగుట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. టీపీసీసీ ప్రెసిడెంట్ఉత్తమ్ కుమార్ రెడ్డిమాట్లాడుతూ… ఉద్దేశపూర్వకంగానే తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఎదుర్కొలేకే ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. మరికాసేపట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి.. తమ బృందంతో కలిసి డీజీపీ, ఈసీని కలవనున్నారు.

Next Story

Most Viewed