శ్రీశైలం ప్రమాదంపై ఉత్తమ్ దిగ్భ్రాంతి..

by  |
శ్రీశైలం ప్రమాదంపై ఉత్తమ్ దిగ్భ్రాంతి..
X

దిశ, వెబ్‌డెస్క్ : శ్రీశైలం ఎడమగట్టులోని జలవిద్యుత్ కేంద్రంలో శుక్రవారం ఉదయం అగ్నిప్రమాద ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఐదుగురు మృత్యవాత పడగా, మరో నలుగురి ఆచూకీ కోసం రెస్క్యూ సిబ్బంది గాలింపు చర్యలు చేపడుతున్నారు.

తాజాగా, శ్రీశైలం ఘటనపై టీపీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు. ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై తెలంగాణ ప్రభుత్వం లోతుగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రమాద బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని.. వారి కుటుంబంలోని అర్హులకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


Next Story

Most Viewed