జనగామలో ఉత్తమ్ అరెస్ట్

by  |
జనగామలో ఉత్తమ్ అరెస్ట్
X

దిశ, జనగామ: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. జనగామ మీదుగా చలో మల్లారం సభకు వెళ్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఆదివారం పెంబర్తిలో జనగామ పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. మల్లరానికి వెళ్లకుండా నాయకులను ఎక్కడికక్కడ నిలువరించారు. మరోవైపు మల్లారంకు వెళ్లే దారుల వద్ద పోలీసులు బందోబస్తు చేపట్టారు.

అయితే.. మల్హర్ మండలం మల్లారం గ్రామానికి చెందిన దళితుడు రెవెల్లి రాజబాబును కొట్టి చంపడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఛలో మల్లారం కార్యక్రామనికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ నాయకులు కూడా చలో మల్లారం కార్యక్రామం చేపట్టారు. ఇరు పార్టీలు కూడా ఆదివారం రోజునే ఈ కార్యక్రమానికి పిలునివ్వడంతో పోలీసులు ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టారు. మల్లారం గ్రామంలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా విపత్తు నివారణ చట్టాన్ని కూడా ఉపయోగిస్తామని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకులు అరెస్ట్



Next Story