- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, న్యూస్బ్యూరో: కేటీఆర్ ఫాంహౌస్ విచారణ న్యాయబద్ధంగా జరగాలంటే మంత్రి కేటీఆర్ కేబినెట్ నుంచి తప్పుకోవాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి డిమాండ్ చేశారు. 111 జీవోకు వ్యతిరేకంగా కేటీఆర్ అక్రమ నిర్మాణాలు చేపట్టారని ఆరోపించారు. గాంధీభవన్లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ భార్య శైలిమ పేరు మీద భూమి ఉందని నిరూపించేందుకు తాను సిద్ధమన్నారు. ఎన్నికల అఫిడవిట్లో లీజుకు ఉన్న భూమి వివరాలు ఎందుకు చూపించలేదని ప్రశ్నించారు. ఈ లీజు ఎవరి దగ్గర తీసుకున్నారో చెప్పితే మిగతా వివరాలన్నీ చెప్తానని, 301 నుంచి 303 సర్వే నెంబర్ వరకు కేటీఆర్కు భూములున్నాయని ఉత్తమ్ వివరించారు. వీటన్నింపైనా కేటీఆర్ వివరణ ఇవ్వాలన్నారు. విచారణ నిష్పక్షపాతంగా జరగాలంటే కేబినెట్ నుంచి కేటీఆర్ తప్పుకోవాలన్నారు. కేటీఆర్ అవినీతిపై పోరాడిన రేవంత్రెడ్డిని జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టారని, 111 జీవోను ప్రభుత్వం సవరించాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు.