పారికర్ తనయుడికి పాజిటివ్..

by  |
పారికర్ తనయుడికి పాజిటివ్..
X

దిశ, వెబ్ డెస్క్ :

దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గోవా మాజీ సీఎం, మాజీ రక్షణశాఖ మంత్రి మనోహర్‌ పారికర్‌ తనయుడు, బీజేపీ లీడర్ ఉత్పల్‌ పారికర్‌కు సోకింది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ‘నాకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. పెద్దగా లక్షణాలేకున్నా హోం క్వారంటైన్‌లో ఉండాలని నిర్ణయించినట్టు ’ చెప్పుకొచ్చారు.

ఆదివారం ఉత్పల్ పారికర్ మరోసారి ట్వీట్ చేస్తూ.. ’వైద్యుల సలహా మేరకు ఆస్పత్రిలో చేరాను. నేను త్వరగా కోలుకోవాలని కోరుకున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అని పోస్టు చేశారు. కాగా, గోవాలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 11,339కు చేరింది. అందులో 7,488 మంది కరోనా నుంచి కోలుకోగా, 98మంది మృతి చెందారు.

Next Story

Most Viewed