చౌటుప్పల్‌లో డ్రోన్ కెమెరాలతో నిఘా

by  |
చౌటుప్పల్‌లో డ్రోన్ కెమెరాలతో నిఘా
X

దిశ, నల్లగొండ: చౌటుప్పల్ పట్టణంలో లాక్‌డౌన్‌ను పోలీసులు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. డ్రోన్​ కెమెరాల ద్వారా డీసీపీ నారాయణరెడ్డి, ఏసీపీలు సత్తయ్య, శ్రీనివాస్ ​జనసంచారాన్ని నిశితంగా పరిశీలించారు. ప్రధాన రోడ్ల వెంటే కాకుండా గల్లీల్లోనూ జనం రాకపోకలపై పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాలేదని, కానీ, ఎవరూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించొద్దని సూచించారు.

Tags;choutuppal,drone camera,lockdown



Next Story