తెలంగాణాలో ట్రంప్ భక్తుడు మృతి

by  |
తెలంగాణాలో ట్రంప్ భక్తుడు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ను దేవుడిలా పూజించే తెలంగాణలోని జనగామ జిల్లాకి చెందిన బుస్స కృష్ణ హఠాన్మరణం చెందాడు. ట్రంప్ కి కరోనా వచ్చినప్పటి నుండి కృష్ణ ఆవేదనతో ఉన్నాడు.

ఈ క్రమంలో గుంఢె పోటుతో చనిపోయాడని బంధువులు చెబుతున్నారు. 2017 లో దీపావళి పండుగ రోజు హరికృష్ణ తన ఇంట్లో ట్రంప్ చిత్రపటానికి పూజలు చేస్తూ అభిమానాన్ని చాటుకున్నాడు. ఆ తర్వాత ఏకంగా తన ఇంటి ప్రాంగణంలోనే ట్రంప్ కోసం గుడి కట్టాడు.

వంద కోట్ల భారతీయుల్లో క్రిష్ నా ప్రాణ స్నేహితుడు. క్రిష్ నా అభిమాని. అతను నా ఫోటోల ధ్వారా గొప్ప శక్తిని పొందాలని ప్రార్థిస్తున్నా. క్రిష్ ను త్వరలోనే కలుస్తా అని గతంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్వీట్ కూడా చేశారు.


Next Story

Most Viewed