ఇండియా మురికిగా ఉంటుంది : ట్రంప్

by  |
ఇండియా మురికిగా ఉంటుంది : ట్రంప్
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండియాపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా బైడెన్‌తో జరుగుతున్న డిబెట్‌లో భారత్ మురికిగా ఉంటుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘భార‌త్‌, చైనా, ర‌ష్యా దేశాలను చూడండి ఎంత మురికిగా ఉంటాయో అని వ్యాఖ్యానించారు. అంతేగాకుండా ఈ దేశాల్లో గాలి కూడా కలుషితంగా ఉంటుందని వెల్లడించారు.

గతంలోనూ కరోనా లెక్కలు సరిగా చెప్పడం లేదు కాబట్టే ఇండియాలో కేసులు తక్కువగా ఉన్నాయని తెలిపారు. అయితే దీనిపై ట్విట్ట‌ర్‌లో కొంద‌రు అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. సీనియ‌ర్ కాంగ్రెస్ నేత క‌పిల్ సిబ‌ల్ ఈ అంశంపై ట్వీట్ చేశారు. ప్ర‌ధాని మోదీ స్నేహితుడు ట్రంప్ భార‌త్ గురించి ఎటువంటి ప్ర‌క‌ట‌న చేశారో అర్థం చేసుకోవాల‌న్నారు. అంతేగాకుండా ట్రంప్ చేసిన కామెంట్ల‌ను క‌పిల్ సిబ‌ల్ త‌ప్పుప‌ట్టారు.


Next Story

Most Viewed