- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ,వెబ్డెస్క్:ఘట్కేసర్ ప్రాంతంలో బీ ఫార్మసీ విద్యార్థినిపై అత్యాచారం కేసు విచారణలో మరిన్ని దారుణాలు బయటపడ్డాయి. సీసీ టీవీ పుటేజీ ఆధారంగా భాస్కర్, రమేష్, ఆటో డ్రైవర్ రాజు, శివలను పోలీసులు అరెస్ట్ చేసి విచారణ ప్రారంభించారు. విచారణలో యువతికి మత్తుమందు ఇచ్చి వ్యాన్ లో అత్యాచారం చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు. ముందస్తు ప్లాన్లో భాగంగా అత్యాచారం తర్వాత యువతిని చంపేయాలని అనుకున్నట్లు తెలుస్తోంది. అయితే అదే సమయంలో పోలీసు వాహనాల సైరన్ లు విని ఎన్ కౌంటర్ చేస్తారని భయపడి.. యువతిని వ్యాన్ నుంచి దించి చెట్ల పొదల్లో పడేసి వెళ్లిపోయినట్లు నిందితులు పోలీసులకు చెప్పారు. ఈ దారుణం కంటే ముందే గతంలోనూ అనేకసార్లు ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడినట్లు నిందితులు విచారణలో ఒప్పుకున్నారు. దీంతో పోలీసులు మృగాళ్లపై కిడ్నాప్, రేప్ బెదిరింపులకు సంబంధించిన కేసులు నమోదు చేశారు.