- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
సికింద్రాబాద్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ (కోవిడ్-19).. నిన్ననే తెలంగాణలోకీ ప్రవేశించింది. దీనిపై మెగా పవర్స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన ట్విట్టర్ వేదికగా స్పందించారు. సికింద్రాబాద్లోని అపోలో ఆసుపత్రిలో కరోనా కేసును గుర్తించినట్టు వెల్లడించారు. అనంతరం సదరు పేషెంట్ను గాంధీ ఆస్పత్రికి తరలించామనీ, ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగానే ఉందని స్పష్టం చేశారు. ఈ వైరస్పై అపోలో ఆస్పత్రిలోనే అత్యంత కచ్ఛితత్వంతో స్క్రీనింగ్ ప్రొటోకాల్స్ను పాటిస్తున్నామని వెల్లడించారు. ఈ సందర్భంగా కరోనా వైరస్ బారిన పడకుండా ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఏ మాత్రం వ్యాధి లక్షణాలు కనిపించినా, వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో దీనికి సంబంధించిన ఓ వీడియోను పోస్ట్ చేశారు.
Next Story