మెట్రో స్టేషన్‌లోనే మా నిద్ర

by  |
మెట్రో స్టేషన్‌లోనే మా నిద్ర
X

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీలో గత కొద్దిరోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అన్నానగర్ లో కొన్ని ఇండ్లు దెబ్బతిన్నాయి. దీంతో సోమవారం రాత్రి సుమారు 10-15 కుటుంబాల వరకు మెట్రో స్టేషన్ వద్ద ఆశ్రయం పొందారు. ఇటీవల కురిసిన వర్షం కారణంగా తమకు ఏర్పాటు చేసిన తాత్కాలిక ఆశ్రయంలోకి కూడా నీరు రావడంతో వారు మెట్రో స్టేషన్ వద్ద ఆశ్రయం పొందారు. ఈ సందర్భంగా వారిలో ఒకరు మాట్లాడుతూ.. వర్షాల కారణంగా మేం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, మా ఇబ్బందులను ఎవరూ పట్టించుకోవడంలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.



Next Story

Most Viewed