యూపీ హెల్త్ మినిస్టర్‌కు కరోనా

by  |
యూపీ హెల్త్ మినిస్టర్‌కు కరోనా
X

లక్నో: ఉత్తరప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి అతుల్ గార్గ్‌కు కరోనా పాజిటివ్‌‌గా తేలింది. ఆగస్టు 15న టెస్టు చేయించుకోగా నెగెటివ్ వచ్చిందని, తాజా టెస్టులో పాజిటివ్ వచ్చిందని ఆయన వివరించారు. కాబట్టి ఈ నెల 16 నుంచి 18వ తేదీల్లో తనను కలిసినవారందరూ కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించారు. ఉత్తరప్రదేశ్‌లో ఇద్దరు క్యాబినెట్ మంత్రులు కమల్ రాణి వరుణ్, చేతన్ చౌహాన్‌లు కరోనాతో తనువు చాలించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు సుమారు పదిమంది మంత్రులకు పైగానే కరోనా పాజిటివ్ తేలినట్టు సమాచారం.

Next Story

Most Viewed