అర్ధరాత్రి బస్టాప్ లో వ్యక్తి దారుణ హత్య.. చేసిందెవరు..?

by  |
అర్ధరాత్రి బస్టాప్ లో వ్యక్తి దారుణ హత్య.. చేసిందెవరు..?
X

దిశ, శేరిలింగంపల్లి: గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన రాయదుర్గం పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం తెల్లవారుజామున రాయదుర్గంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందుగల బస్టాప్ లో ఒక గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రక్తపు మడుగులో పడిఉన్న వ్యక్తి మృతదేహాన్ని పరిశీలించారు.

తలకు బలమైన గాయాలు కావడంతో అతను చనిపోయినట్లు గుర్తించారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు బండరాయితో తలపై మోది హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడు దాదాపు 35-40 సంవత్సరాల వయస్సు కలిగి ఉండి, తెల్లగా, బక్కగా ఉన్నాడని, ఒంటిపై బూడిద-నీలి రంగు గల షర్ట్, నీలి రంగు ప్యాంటు ధరించి ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఈమేరకు రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Next Story

Most Viewed